News November 8, 2025

గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

image

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 21, 2026

ADB: గ్యాస్ డెలివరీలో అలస్యమైతే.. కాల్ చేయండి

image

గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 21, 2026

ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకుంటే నిర్ణీత గడువులోగా నేరుగా ఇంటికే డెలివరీ చేయబడతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో సరఫరా వ్యవస్థ సజావుగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

News March 21, 2026

ఆదిలాబాద్: జనగణన పారదర్శకంగా జరగాలి – కలెక్టర్

image

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన (సెన్సస్-2027) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీసీలో టెక్నికల్ అసిస్టెంట్లు, క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఎక్కడా తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.