News November 8, 2025

శ్రీవారి రక్తం నుంచి ఉద్భవించింది ఎర్ర చందనం: DCM పవన్

image

ఎర్ర చందనం చాలా అపురమమైనదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గాయం తగిలి, గాయం వల్ల చిందిన రక్తంతో ఎర్రచందనం పుట్టినట్లు శాస్త్రం చెబుతోందన్నారు. ఏపీలోని స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిలిపివేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News March 22, 2026

పూతలపట్టు: ఉదయాన్నే ఘోర ప్రమాదం.. ఇద్దరి స్పాట్ డెడ్

image

పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాలు మేరకు.. బెంగళూరు వైపు నుంచి తిరుమలకు వెళ్తున్న కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కారు లారీని ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 22, 2026

WGL: రేపు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం!

image

రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఆదివారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 6 లక్షల మంది రైతులకు భరోసా నిధులు రానున్నాయి. తొలి విడతలో భాగంగా ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రూ.6 వేల చొప్పున సోమవారం జమ కానున్నాయి. మరో 20 రోజుల తర్వాత 2 విడత, ఏప్రిల్ చివరి వారంలో 3వ విడత కింద భరోసా నిధుల విడుదల కానున్నాయి. ఒక్కో జిల్లాకు రూ.150 నుంచి రూ.170 కోట్ల వరకు నిధులు రానున్నాయి

News March 22, 2026

హిరమండలం: యువతిని ప్రేమించాడు.. కులం పేరుతో దూషించాడు.. జైలు

image

హిరమండలం మండలం నిమ్మలపాడు గ్రామానికి చెందిన గిరిజన యువతిని కులం పేరుతో దూషించినందుకు పోలాకి మండలానికి చెందిన దుర్గారావుకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్సై హేమంత్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజన యువతిని ప్రేమ పేరుతో దుర్గారావు మోసం చేశాడు. పెళ్లి చేసుకోమని మహిళ అడగగా కులం పేరుతో దూషించాడని ఎస్ఐ చెప్పారు. దీనిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు.