News November 8, 2025

మెదక్: దారుణం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు

image

టేక్మాల్ మండలం వేల్పుగొండలో తల్లిని కొట్టి చంపిన దారుణ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. గ్రామానికి చెందిన సుదర్శన్ శుక్రవారం రాత్రి తల్లి సత్యమ్మ(60)తో మద్యం కోసం డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. తల్లి డబ్బులు ఇవ్వకపోవడంతో తాగి ఉన్న అతడు కర్రతో కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సత్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె అనురాధ ఫిర్యాదుతో ఏఎస్ఐ కృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News November 9, 2025

ఇవన్నీ క్యాన్సర్ కారకాలే!

image

నిత్యం మనం ఉపయోగించే 200 రకాల వస్తువులు క్యాన్సర్‌కు దారి తీస్తాయని వైద్యులు చెబుతున్నారు. పదేపదే మరిగించే నూనె, ఎండకు ఉండే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, చైనీస్ ఫుడ్ సాస్‌లు, క్యాండీలు, కృత్రిమ స్నాక్స్, టీ బ్యాగులు, ప్లాస్టిక్ కోటింగ్ ఉన్న టీ కప్పులు వీటిలోకే వస్తాయంటున్నారు. ప్లాస్టిక్, ప్రాసెస్డ్ ఫుడ్, వాడిన నూనెను వాడకపోవడం వంటి వాటికి దూరంగా ఉంటే ఈ ముప్పును చాలావరకు తగ్గించుకోవచ్చంటున్నారు.

News November 9, 2025

రాయదుర్గం PSలో మాగంటి గోపీనాథ్ తల్లి ఫిర్యాదు

image

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలు ఉన్నాయని గోపీనాథ్ మృతి ఆయన తల్లి రాయదుర్గం PSలో ఫిర్యాదు చేశారు. మాగంటి మహనంద కుమారి కుమారుడు మరణంపై పోలీసులు దర్యాప్తు చెయ్యాలని సూచించారు. మృతికి సంబంధించి మొదటి నుంచి తల్లి మహానందకుమారి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసిందే.

News November 9, 2025

రేవంత్ సర్టిఫికెట్ నాకు అవసరం లేదు: కిషన్ రెడ్డి

image

TG: BJP, BRS కలిసిపోయాయని రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంలో మాట్లాడుతూ ‘రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగినా భయపడను. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఆయన సర్టిఫికెట్ నాకు అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధికి BJP ఏం చేసిందో నాకు తెలుసు. రూ.లక్ష కోట్ల అవినీతిని బయట పెడతామని రాహుల్, రేవంత్ చెప్పి రూ.లక్ష కూడా వెలికితీయలేదు’ అని ఎద్దేవా చేశారు.