News November 8, 2025
దొంగ-పోలీస్ గేమ్ ఆడుదామని అత్తను చంపేసింది!

AP: దొంగ-పోలీస్ గేమ్ పేరుతో అత్తను కోడలు చంపేసిన ఘటన విశాఖ(D) పెందుర్తిలో జరిగింది. మహాలక్ష్మీ(63), ఆమె కోడలు లలిత మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆమెపై పగ పెంచుకున్న కోడలు దొంగ-పోలీస్ ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలతో పాటు కాళ్లు, చేతులు కట్టేసింది. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీపం అంటుకొని చనిపోయినట్లు PSకు సమాచారం అందించింది. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది.
Similar News
News March 22, 2026
ఈ నెల 25న కాంగ్రెస్కు గుడ్బై: జీవన్ రెడ్డి

TG: ఈ నెల 25న కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని తెలిపారు. కాగా నిన్న మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ గంటన్నర సేపు బుజ్జగించినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. కాగా జీవన్ రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పని చేశారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు.
News March 22, 2026
కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం: CBN

1999-2004 మధ్య హైదరాబాద్ను శరవేగంగా అభివృద్ధి చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. HYD ISBలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అప్పట్లో తాను కృషి చేయడం వల్లే జినోమ్ వ్యాలీ వచ్చిందని గుర్తు చేశారు. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయామని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పదేళ్లు పట్టిందన్నారు. 2014-19 వరకు APలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, కేవలం అభివృద్ధి పైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమని తెలిపారు.
News March 22, 2026
ఎండల్లో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?

వేసవిలో శరీర చల్లదనం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఇవి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో చక్కెర, కెఫీన్ అధికంగా ఉంటాయి. దీంతో టైప్-2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, దంతాలు పుచ్చిపోవడం, ఆస్టియోపోరోసిస్, నిద్ర లేమి, డీహైడ్రేషన్, గుండె సమస్యలు రావొచ్చు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, షర్బత్, మజ్జిగ, పండ్లు, కూరగాయల స్మూతీలు తీసుకోవడం మంచిది’ అని సూచిస్తున్నారు.
#ShareIt


