News April 11, 2024
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ విజయం: సజ్జల

AP: వచ్చే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గతంలో తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లను తొలగిస్తామని చంద్రబాబు, పవన్ విషం కక్కారు. కానీ ఇప్పుడు వాలంటీర్లపై ప్రేమ ఎలా వచ్చిందో? వారికి రూ.10 వేలు ఇస్తామంటున్నారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారు. వారు అధికారంలోకి వచ్చాక వాలంటీర్లకు బదులు జన్మభూమి కమిటీలు వస్తాయి’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News December 31, 2025
కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన శిక్షలు: జిల్లా ఎస్పీ

కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా వేగవంతమైన దర్యాప్తుతో త్వరితగతిన శిక్షలు సాధ్యమయ్యాయని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. 11 తీవ్రమైన నేరాల కేసులలో 16 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడినట్లు తెలిపారు. మరో 3 కేసుల్లో 4 మంది నిందితులకు 10 సంవత్సరాలకు పైగా శిక్షలు పడ్డాయన్నారు. జిల్లాలో 2023లో 304 కేసుల్లో, 2024లో 304 కేసుల్లో, 2025లో 314 కేసుల్లో శిక్షలు విధించబడ్డాయన్నారు.
News December 31, 2025
మోడర్న్ వెపన్స్ కొనుగోలుకు రూ.4,666కోట్ల ఒప్పందాలు

రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తాజాగా రూ.4,666Crతో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్స్, హెవీ వెయిట్ టార్పడోస్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు భారత్ ఫోర్జ్ లిమిటెడ్, PLR సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్లతో ఒప్పందం కుదుర్చుకుంది. 2030 నాటికి ఇవి డిఫెన్స్కు అందనున్నాయి. కాగా 2025-26 వార్షిక ఏడాదిలో రక్షణ రంగానికి కేంద్రం రూ.1,82,492 కోట్లను కేటాయించింది.
News December 30, 2025
భారత్ విజయం.. సిరీస్ క్లీన్స్వీస్

శ్రీలంక ఉమెన్స్ టీమ్తో జరిగిన 5 టీ20ల సిరీస్ను భారత అమ్మాయిలు వైట్వాష్ చేశారు. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 రన్స్ తేడాతో విజయం సాధించారు. 176 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన లంక 160/7 పరుగులకే పరిమితమైంది. భారత జట్టులో దీప్తి, అరుంధతి, స్నేహ్ రాణా, వైష్ణవి, శ్రీచరణి, అమన్జోత్ తలో వికెట్ తీశారు.


