News November 8, 2025
ఉలవపాడు: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

ఉలవపాడు మండలంలోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెంకు చెందిన యువకుడు శనివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. SI అంకమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపట్టపుపాలెంకు చెందిన వాయిల చంద్రయ్య, ఆయన కుమారుడు రాజు ఉదయం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు తిరగబడింది. ఆ ఘటనలో రాజు చనిపోయినట్లు తెలిపారు.
Similar News
News March 16, 2026
నెల్లూరు: ‘గ్యాస్’ సమస్యలా.. కాల్ చేయండి.!

జిల్లాలో గ్యాస్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు JC వెంకటేశ్వర్లు తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఆలస్యం, అధిక ధరలు వసూలు చేయడం, గ్యాస్ బుకింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్కు 9492273897 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
News March 16, 2026
‘కౌమార దశలో గర్భధారణ’పై పోస్టర్ విడుదల

కౌమార దశలో గర్భధారణకు సంబంధించిన కారణాలు, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్ ఆవిష్కరించారు. అనుమానాస్పద సంఘటనలు కనిపించిన వెంటనే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. కౌమార దశలో ఉన్న బాలికల భవిష్యత్తు రక్షణకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
News March 16, 2026
నెల్లూరు కార్పొరేషన్లో 362 ఫిర్యాదులు

నెల్లూరు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో మేయర్ దేవరకొండ సుజాత అశోక్, అదనపు కమిషనర్ హిమబిందు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 43 వ్యక్తిగత వినతులు, సి.పి.ఎమ్ ఆధ్వర్యంలో వచ్చిన 319 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు కమిషనర్, వీటిని నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


