News November 8, 2025

తిరుపతిలో ఒకే వేదికపై తండ్రి కొడుకులు

image

తిరుపతిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జి.ఆర్. మధుసూదన్ తన విధుల్లో భాగంగా పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో ఆయన తండ్రి తిరుపతి అర్బన్ డిప్యూటీ తహశీల్దార్ జి. రామచంద్ర కూడా పాల్గొన్నారు. వీరిని డిప్యూటీ సీఎం అభినందించారు.

Similar News

News April 3, 2026

₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

image

రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్‌ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్‌ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.

News April 3, 2026

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ జి. శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, సిద్దిపేట ప్రజలు పాల్గొన్నారు.

News April 3, 2026

నిర్మల్: సీఎం పర్యటన.. కలెక్టర్ దిశానిర్దేశం

image

ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సీఎం బాసర చేరుకున్న నుంచి, ఆలయ సందర్శన, పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, తిరిగి వెళ్లేవరకు వివిధ శాఖల అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్, ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు.