News November 8, 2025
సీఎం పర్యటనలో లోపాలు లేకుండా పనిచేయాలి: కలెక్టర్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెంలో మధ్య, చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల పార్కు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్నారన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయలని సూచించారు.
Similar News
News March 17, 2026
ప్రకాశం: పంచాయతీలకు ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక అధికారులు

జిల్లాలో పంచాయితీ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ఏప్రిల్ 2 నుంచి జిల్లాలో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోందని DPO వెంకటేశ్వరరావు అన్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల అభివృద్ధికి అధికారుల ద్వారా పాలన సాగుతుందని చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 27 మండలాల్లో 519 పంచాయతీలు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలకు 405 మంది అధికారులు ఉంటారన్నారు.
News March 17, 2026
2 నెలల పాపకు పేరు పెట్టిన ప్రకాశం JC

కురిచేడు మండలానికి చెందిన చెంచు కుటుంబాలు 29 మంది నాగర్ కర్నూలు (D) బొగ్గుల బట్టిలో పదేళ్లుగా బానిస కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. <<19399497>>స్పందించిన అధికారులు<<>> సోమవారం వీరిని కలెక్టర్ రాజాబాబు దగ్గర హాజరుపరిచారు. కలెక్టర్ వీరికి పునరావాస చర్యలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కార్మికుల్లో ఓ దంపతుల 2 నెలల పాపకు JC ” ప్రేరణ” అని నామకరణం చేశారు.
News March 17, 2026
దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


