News November 9, 2025
19 నుంచి 23 వరకు పల్నాటి వీరుల ఉత్సవాలు

పల్నాటి వీరుల ఉత్సవాలు కారంపూడిలో ఈ నెల 19 నుంచి 23 వరకు జరుగుతాయని పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తెలిపారు. 5 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలను ఆయన ప్రకటించారు. నవంబర్ 19న రాచగావు, 20 రాయబారం, 21 మందపోరు, 22 కోడిపోరు, 23 కల్లిపాడు జరుగుతాయని తెలిపారు. 22న కోడిపోరు సందర్భంగా పెద్ద ఎత్తున తిరునాళ్ల జరుగుతుందన్నారు. పల్నాడు బ్రహ్మనాయుడు వీరాచారవంతులు కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు.
Similar News
News March 12, 2026
మంథని జేఎన్టీయూలో నూతన ఆడిటోరియం ప్రారంభం

మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల బ్లాక్-2లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన టీసీఎస్ ఒప్పందం మేరకు ఉద్యోగాలకు ఎంపికైన 100 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు
News March 12, 2026
గ్యాస్ కొరత.. రాష్ట్రంలోని హోటళ్ల కీలక నిర్ణయం

కమర్షియల్ గ్యాస్ కొరత, నిర్వహణ ఖర్చులపై AP హోటల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈమేరకు విజయవాడలో అత్యవసరంగా సమావేశమైంది. గ్యాస్ ఇబ్బందుల దృష్ట్యా స్టార్ హోటళ్లలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఆర్డర్లను త్వరలోనే నిలిపివేస్తామని పేర్కొంది. ప్రతి సోమవారం రెస్టారెంట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. కర్ణాటక తరహాలో కొన్ని హోటల్స్ కేవలం టీ, కాఫీలు మాత్రమే విక్రయించే పరిస్థితి రాబోతోందని తెలిపింది.
News March 12, 2026
కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన పెద్దపల్లి ఎంపీ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీపై ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. 2019లో అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చిన ఘటనలను ప్రజలు మరచిపోలేదన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి నాయకుడి బాధ్యత, ప్రజల తీర్పే తుది అని వంశీ కృష్ణ స్పష్టం చేశారు.


