News November 9, 2025
ధర్మపురి నర్సన్నకు భారీ ఆదాయం

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల తాకిడీ పెరిగింది. దీంతో అదే మొత్తంలో నర్సన్నకు భారీగా ఆదాయం సమకూరింది. దేవాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.2,72,258, ప్రసాదాల ద్వారా రూ.1,95,750, అన్నదానం ద్వారా రూ.57,759.. మొత్తం ఆదాయం రూ.5,25,767 ఆదాయం వచ్చింది. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.
Similar News
News March 22, 2026
రేవంత్ సిద్దిపేట పర్యటనకు హరీశ్ రావు వస్తారా?

TG: CM హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి సిద్దిపేటకు వస్తుండటంతో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. నియోజకవర్గానికి రావాల్సిన ₹1,000 కోట్ల నిధులు ఆగిపోయాయంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఆయన హాజరవుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రుణమాఫీ కాని రైతులతో కలిసి నిరసన తెలుపుతామని హరీశ్ ప్రకటించడంతో ఆదివారం పర్యటనలో ఏం జరుగుతుందో చూడాలి.
News March 22, 2026
UAEపై ఇరాన్ డ్రోన్ల వర్షం.. అసలు ప్లాన్ ఇదే!

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు UAEని మంటల్లోకి నెట్టింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం అందుకున్న $5.2 ట్రిలియన్ల పెట్టుబడుల్లో సింహభాగం (27%) UAE నుంచే వచ్చాయి. అందుకే ఆ దేశంపై దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ పరోక్షంగా దెబ్బతీస్తోంది. ప్రపంచ పెట్టుబడుల హబ్గా ఎదిగిన దుబాయ్ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాలపై నమ్మకం పోయేలా చేయడం ఇరాన్ వ్యూహం.
News March 22, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

మహబూబ్నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.


