News November 9, 2025
రేపు సాలూరు ప్రభుత్వ ఐటీఐలో అప్రెంటీస్ మేళా

సాలూరు ప్రభుత్వ ఐటీఐ వద్ద సోమవారం అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస ఆచారి తెలిపారు. బొబ్బిలి, విజయనగరం, విశాఖలోని ప్రముఖ కంపెనీల్లో 100 వేకెన్సీలు ఉన్నాయన్నారు. అప్రెంటీస్ అయిన వారు ప్లేస్మెంట్ కోసం కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. స్టైఫండ్ రూ.12 వేలు నుంచి రూ.15 వేలు వరకు ఇస్తారని, అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు తీసుకొని ఉదయం 10 గంటలకు హాజరుకాలన్నారు.
Similar News
News November 9, 2025
HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్మెంట్స్లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 9, 2025
మొంథా తూఫాన్ నష్టం నివేదిక అందించండి: మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతుల పొలాలను సందర్శించి పక్కాగా నివేదిక తయారు చేయాలని, ఏ ఒక్క నష్టపోయిన రైతు మిగలకుండా ప్రతి ఒక్కరిని కవర్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నిర్నిత నమూనాలో తుఫాన్ నష్టం అంచనా నివేదికలు సమర్పించాలని అదేశించాలన్నారు. పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ రోడ్లు ఎంత మేరకు మరమ్మతులకు అవసరమో తెలుపలాన్నారు.
News November 9, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు బాగుపడేదెన్నడో..!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రోడ్లు గుంతలమయంగా మారి, ప్రయాణం నరకంగా మారింది. గతంలో కొందరు నేతలు రోడ్లపైకి వచ్చి గళమెత్తారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం మినహా క్షేత్రస్థాయిలో రోడ్ల సమస్యకు పరిష్కారం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేతలు పట్టించుకొని రోడ్లను బాగు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


