News April 11, 2024
జగన్ సంస్కరణలతో పేదరికం తగ్గింది: బొత్స

AP: సీఎం జగన్ చేపట్టిన సంస్కరణలతో ఏపీలో పేదరికం తగ్గిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ చెప్పిందే చేశారన్నారు. ఆర్థిక కారణాలతో సీపీఎస్ అమలు చేయలేకపోయామని తెలిపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News April 20, 2026
GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్క్వార్టర్స్

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా
News April 20, 2026
అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
News April 20, 2026
అమెరికా వార్షిప్స్పై ఇరాన్ డ్రోన్ దాడులు

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.


