News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో 100 శాతం గెలుపు కాంగ్రెస్‌దే: CM

image

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 100 శాతం గెలుస్తుందని CM రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. BRSకు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇక BJPకి డిపాజిక్ కూడా దక్కదన్నారు. ఆదివారం మీట్‌ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. BJPకి డిపాజిట్ రాదన్న విషయం కిషన్ రెడ్డి గుర్తించాలన్నారు. నవంబర్ 14న ఫలితాలు వచ్చాక చూద్దామంటూ CM వ్యాఖ్యానించారు. ఇక బస్తీల సమస్యలపై మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News November 9, 2025

కమీషన్ల కోసమే మేడారంలో కాలయాపన: నాగజ్యోతి

image

మేడారం జాతరకు మరో 70 రోజులే గడువు ఉన్నప్పటికీ పనులు ఇంకా పునాది దశలోనే ఉన్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. కమీషన్ల కోసమే అధికారులు పనుల్లో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పచ్చని మేడారాన్ని ఎడారిలా మార్చేశారని, షాపులు కోల్పోయిన వ్యాపారులకు తక్షణమే ప్రత్యామ్నాయం చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.

News November 9, 2025

తణుకు: బీసీ వసతి గృహంలో కలెక్టర్ తనిఖీలు

image

తణుకులోని పాత ఊరు బాలికల బీసీ హాస్టల్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థినులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, రుచిగా ఉందా అని ఆరా తీశారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News November 9, 2025

2024 జులై నుంచి ఉన్నవారి జోలికి హైడ్రా వెళ్లదు

image

నగరంలో తొలి విడతలో 6 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుంచి 180 ఎకరాలకు పెంచామన్నారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700 వరకు కేసులు పెట్టారని, 2024 జులైకి ముందు నుంచే నివాసం ఉన్న వారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదన్నారు.