News November 9, 2025
మైనార్టీ వెల్ఫేర్ డే కు ఏర్పాట్లు పూర్తి: VZM కలెక్టర్

జనాబ్ మౌలానా అబుల్ కలాం అజాద్ జన్మదినం సందర్భంగా రేపు విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు మైనారిటీ వెల్ఫేర్ డే & జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన ప్రముఖులు, అధికారులు పాల్గొంటారన్నారు.
Similar News
News March 10, 2026
VZM: గిరిజన మహిళలకు గుడ్ న్యూస్

జిల్లాలో గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం SCA పథకం అమలు చేస్తోందని గిరిజన సాధికారిత అధికారి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ పథకం కింద 54 ఉపాధి యూనిట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ. 1.62 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఒక్కో లబ్ధిదారునికి రూ. 50 వేల సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఆయన వివరించారు.
News March 10, 2026
నాటు తుపాకుల నియంత్రణకు ‘కార్డన్ సెర్చ్’: ఎస్పీ

జిల్లాలో నాటు తుపాకులు, పేలుడు పదార్థాల నియంత్రణకు గుర్తించిన గ్రామాల్లో ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించాలని SP ఎ.ఆర్. దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉండటం నేరమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరి వద్దనైనా నాటు తుపాకులు లభ్యమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ ఆయుధాల సమాచారాన్ని పోలీసులకు అందించి సహకరించాలని కోరారు.
News March 10, 2026
విజయనగరం కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్

విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. నగరపాలక సంస్థలో తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తారు. నగరంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, కీలక నిర్ణయాల బాధ్యత ఇకపై కలెక్టర్ నేతృత్వంలోనే కొనసాగనుంది.


