News November 9, 2025

బాల్య వివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాలు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో బాల్యవివాహాల నిర్మూలనపై రేపటి నుంచి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఐసీడీఎస్ అధికారులు బృందాలుగా ఏర్పడి, జిల్లాలోని వివిధ ప్రాంతాలలో బాల్య వివాహాల అనర్థాలు, నిర్మూలన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News November 10, 2025

సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

image

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండ‌రీ ఆసుప‌త్రులుండ‌గా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుప‌త్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్ద‌రు చొప్పున, మ‌రో 13 ఏరియా ఆసుప‌త్రుల‌కు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుప‌త్రుల‌కు ఇద్ద‌రు చొప్పున స్పెష‌లిస్టుల‌ను నియ‌మించారు. మ‌రో 97 ఆసుప‌త్రుల‌కు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.

News November 10, 2025

సైబరాబాద్ వ్యాప్తంగా 529 మందిపై కేసు నమోదు

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 16 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యంతాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించారు. 529 మందిపై కేసు నమోదు చేశారు. 417 బైకులు, 24 త్రీ వీలర్స్, 88 కార్లతో పాటు పలు వాహనాలను సీజ్ చేశారు. 20 నుంచి 30 ఏళ్ల వయసు గలిగిన వారే ఎక్కువ శాతం మద్యంతాగి వాహనాలను నడిపినట్లు గుర్తించారు. ఇప్పటికైనా ప్రజలు మారాలని సూచిస్తున్నారు.

News November 10, 2025

అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

image

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.