News April 11, 2024
కుప్పం మీదుగా స్పెషల్ రైలు

గోరఖ్పూర్ స్పెషల్ రైలును రేపటి నుంచి కుప్పం మీదుగా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కుప్పం మీదుగా కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస మీదుగా గోరఖ్పూర్ చేరుకుంటుంది. ఇదే మార్గంలో సోమవారం సాయంత్రం 5.40గంటలకు కుప్పం మీదుగా బెంగళూరు కృష్ణరాజపురానికి వెళ్తుంది. 6 వారాలు మాత్రమే ఈ స్పెషల్ రైలు నడవనుంది.
Similar News
News October 5, 2025
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

వెదురుకుప్పం మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక వివరాల మేరకు.. పచ్చికాపల్లం-తిరుపతి హైవేపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2025
చిత్తూరు కలెక్టరేట్లో రేపు PGRS

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 2 వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
News October 5, 2025
ప్రమాదంలో కృష్ణాపురం రిజర్వాయర్..?

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ప్రధాన గేట్లు మూడు చోట్ల లీకేజీలు ఉండడంతో నీరు వృథాగా పోతోంది. ప్రధాన గేటుకు అవసరమైన జనరేటర్ కూడా పాడైంది. ఐదేళ్లుగా గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఐదేళ్ల క్రితం నిర్మించిన రాక్ కాంక్రీట్ దెబ్బతింది. రిజర్వాయర్కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు.