News November 10, 2025

విజయవాడలోని ఈ ప్రాంతాలపై దృష్టి సారించండి సార్.!

image

విజయవాడ బెంజ్‌సర్కిల్, ప్రభుత్వాసుపత్రి సర్వీస్ రోడ్ ప్రాంతాలు వ్యభిచారానికి అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ రాత్రి 8 గంటల నుంచి కొందరు మహిళలు రోడ్డుపై ఉంటూ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు. వీరు విటులను సమీపంలోని లాడ్జిలకు తీసుకువెళుతున్నారని, పలువురిని బెదిరించి నగదు దోచుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. పోలీసులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News November 10, 2025

ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

image

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.

News November 10, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,900, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17వేలు పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,800, దీపిక మిర్చి రూ.14వేలు, టమాటా మిర్చి రూ.30వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు. 2043 రకం మిర్చికి రూ.22వేలు, 5531 రకం మిర్చికి రూ.15వేల ధర వచ్చింది.

News November 10, 2025

శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎంత ఉన్నాయో తెలుసా..!

image

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి) ద్వారా భక్తులు రూ.10వేలు విరాళం ఇస్తారు. వారికి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు విరాళాలు అందాయని ఇటీవల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందులో రూ.600 కోట్లు ఖర్చు కాగా.. రూ. 1700 కోట్లు ఉన్నాయి. తాజాగా 5వేల ఆలయాల నిర్మాణాలకు సంబంధించి రూ. 750 కోట్లు టీటీడీ బోర్డు మంజూరు చేసింది.