News November 10, 2025
HYD: మన కోసం మరో గంట పెంపు

జూబ్లీహిల్స్లో ఓటు వేసే వారికి EC శుభవార్త చెప్పింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరిగేది. ఈసారి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసేందుకు ఈసీ అవకాశం ఇచ్చింది. 2023 సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 47.49% శాతం మందే ఓటేశారు. ఈ పరిస్థితి మారాలని ఎన్నికల అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మన కోసం మరో గంట సమయం ఇచ్చారు. వెళ్లి ఓటేయండి.
SHARE IT
Similar News
News November 10, 2025
ప్రెగ్నెంట్లు పారాసిటమాల్ వాడొచ్చు: సైంటిస్టులు

గర్భిణులు పారాసిటమాల్ వాడితే పిల్లలకు ఆటిజమ్/ADHD వస్తుందనే వాదనకు ఆధారాలు లేవని బ్రిటిష్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. ప్రెగ్నెంట్లు పారాసిటమాల్/ఎసిటమినోఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు వాడొద్దని ఇటీవల ట్రంప్ పిలుపునివ్వడంతో సైంటిస్టులు పరిశోధన చేశారు. ‘ప్రెగ్నెన్సీలో హై ఫీవర్ బిడ్డపై ప్రభావం చూపుతుంది. పారాసిటమాల్ సురక్షితమైన డ్రగ్. కచ్చితంగా తీసుకోవచ్చు’ అని WHO మాజీ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య తెలిపారు.
News November 10, 2025
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.17,900, వండర్ హాట్ (WH) మిర్చి రూ.17వేలు పలికింది. అలాగే, తేజ మిర్చి ధర రూ.14,800, దీపిక మిర్చి రూ.14వేలు, టమాటా మిర్చి రూ.30వేలు పలికిందని వ్యాపారులు చెప్పారు. 2043 రకం మిర్చికి రూ.22వేలు, 5531 రకం మిర్చికి రూ.15వేల ధర వచ్చింది.
News November 10, 2025
శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎంత ఉన్నాయో తెలుసా..!

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి) ద్వారా భక్తులు రూ.10వేలు విరాళం ఇస్తారు. వారికి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు విరాళాలు అందాయని ఇటీవల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందులో రూ.600 కోట్లు ఖర్చు కాగా.. రూ. 1700 కోట్లు ఉన్నాయి. తాజాగా 5వేల ఆలయాల నిర్మాణాలకు సంబంధించి రూ. 750 కోట్లు టీటీడీ బోర్డు మంజూరు చేసింది.


