News November 10, 2025

ఓ ప్రమాదం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం

image

వరి కోతలకు వెళుతూ కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆదివారం గండేపల్లి(M) రామాయమ్మపాలెం వద్ద 11 కేవీ తీగలు తగిలి యంత్రం డ్రైవర్ గెడ్డం సందీప్ (రాపాక), యజమాని కరిపెట్టి సింహాద్రి అప్పన్న (ఇరగవరం) ప్రాణాలు కోల్పోయారు. అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమైన అప్పన్న పెద్ద కుమారుడు, సందీప్ అక్కలు ఈ వార్త విని గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.

Similar News

News November 10, 2025

కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ

image

సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ క్యాబినెట్ భేటీ కొనసాగుతోంది. సుమారు 70 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ, ఏపీ నైబర్‌హుడ్ వర్క్‌స్పేస్ పాలసీ, ఐటీ శాఖకు చెందిన 10కి పైగా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటు సహా సీఆర్డీఏ, పట్టణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో పనుల పాలనా అనుమతులపై చర్చిస్తోంది.

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.

News November 10, 2025

జూబ్లీహిల్స్‌ను ‘వదలని’ Non-Locals!

image

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది ‘స్థానికేతరులు’ (non-locals) హోటళ్లు, ప్రైవేట్ ఇళ్లలో మకాం వేశారని సమాచారం. ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం వీరు పోలింగ్‌కు ముందు నియోజకవర్గం విడిచివెళ్లాలి. అయితే, వీరిని గుర్తించి పంపించడం అధికారులకు సవాల్‌గా మారింది.