News November 10, 2025

మరో బస్సు ప్రమాదం.. 30 మంది సేఫ్

image

AP: పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Similar News

News November 10, 2025

డ్రాగన్ ఫ్రూట్ సాగు.. అనువైన నేలలు, నాటే సమయం

image

డ్రాగన్ ప్రూట్ పంట ఏ నేలలోనైనా పండుతుంది. అయితే రాళ్ల భూమి, ఎర్ర భూములు ఎక్కువ అనుకూలం. పంటను బెడ్ పద్ధతిలో వేసుకుంటే మంచిది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పంటను నాటుకోవడం శ్రేయస్కరం. ఈ నెలల్లో కాయను కత్తిరించిన మొక్క నుంచి కొమ్మను మనం స్వయంగా చూసి తెచ్చుకొని నాటితే అది 6 నుంచి 9 నెలల్లో కాయలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో నాటే మొక్కలు బతికే అవకాశం ఎక్కువ.

News November 10, 2025

సివిల్స్‌లో పెరగని మహిళల భాగస్వామ్యం

image

సివిల్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడం లేదు. పురుషులతో పోలిస్తే వారు 40% కూడా పోటీలో ఉండడం లేదని UPSC నివేదిక పేర్కొంటోంది. ప్రిలిమ్స్‌లో 2010లో మొత్తం 2,80,901కి గాను ఫీమేల్ 65,738(23.40%) ఉన్నారు. అదే 2021లో 5,10,438 మందికి గాను 1,68,352(32.98%) స్త్రీలు రాశారు. వీరిలో మెయిన్స్‌కు 14.75% మాత్రమే అర్హత సాధించారు. సామాజిక, ఆర్థిక, భద్రతా సమస్యలు, కుటుంబ సహకారం లేమే ఇందుకు కారణాలని విశ్లేషించింది.

News November 10, 2025

AP న్యూస్ అప్డేట్స్

image

* తిరుపతి(D)లో రాయలచెరువు కట్ట తెగి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 960 కుటుంబాలకు రూ.3వేల చొప్పున, మరణించిన 1,100 పశువులకు రూ.2.95 కోట్ల పరిహారం ఇవ్వనుంది.
* తిరుమల పరకామణి చోరీ కేసులో భాగంగా అప్పటి తిరుమల వన్‌టౌన్ పోలీసులు, TTD VGOగా పనిచేసిన గిరిధర్‌ను ఇవాళ CID విచారించింది.
* విశాఖ CII సమ్మిట్‌లో 400+ ఒప్పందాలు జరుగుతాయి. ₹లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి: విశాఖ MP శ్రీభరత్