News November 10, 2025

బురుజుపేటలో పాత సంప్రదాయాలే పాటించాలి..

image

బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో EO శోభారాణి నిర్ణయాలపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయ పద్ధతులు మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో భక్తులకు స్వేచ్ఛగా అభిషేకాలు, పూజలు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు జల్లెడ పెడుతున్నారని, రాత్రిళ్లు గేట్లు మూసేస్తున్నారని ఆరోపించారు. ఈ విషమం MLA వంశీకృష్ణ దృష్టికి భక్తులు తీసుకెళ్లాగా పాత పద్ధతిలనే కొనసాగించాలని EOను అదేశించారు.

Similar News

News November 10, 2025

గాజువాక: బార్‌లో వెయిటర్ ఆత్మహత్య

image

గాజువాకలోని ఓ బార్‌లో వెయిటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. వై.జంక్షన్ వద్ద బార్ అండ్ రెస్టారెంట్‌లో చంద్రమోహన్ అనే వ్యక్తి వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బార్‌లోనే చంద్రమోహన్ ఉరివేసుకోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

News November 10, 2025

13 నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీలో తరగతుల రద్దు

image

AU ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో పార్ట్నర్షిప్ సమిట్-2025 జరగనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ వరకు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు తరగతులను రద్దు చేస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. హాస్టల్ విద్యార్థులు తమ గుర్తింపు కార్డులను చూపి బయటకు వెళ్లవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థినులు మద్దిలపాలెం గేటు, విద్యార్థులు పోలమాంబ ఆలయం పక్కన ఉన్న గేటు వినియోగించాలి.

News November 10, 2025

విశాఖ: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరి అరెస్ట్

image

రైలులో పసి పిల్లలను భిక్షాటన చేయించే గ్యాంగ్‌ను వాల్తేరు RPF/CPDS బృందం పట్టుకుంది. ఆపరేషన్ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగంగా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారులను రక్షించి, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సుధా కుమారి అలియాస్ శాంత, సుఖ్ బాయి ధడి చిన్నారులను ఛత్తీస్‌గఢ్‌ నుంచి డబ్బు ప్రలోభాలతో విశాఖకు తీసుకువచ్చినట్టు విచారణలో తెలింది. కేసు GRP/విశాఖలో నమోదు చేశారు. అనంతరం ఖరోరా PSకు బదిలీ చేశారు.