News November 10, 2025
ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,800 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం గరిష్టంగా పత్తి ధర రూ. 6,950 పలకగా.. నేడు భారీగా పడిపోయింది. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.
Similar News
News November 10, 2025
గద్వాల: ప్రజావాణికి 61 ఫిర్యాదుల వెల్లువ

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి, ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 10, 2025
సంగారెడ్డి: టీచర్లను సర్దు బాటు చేస్తూ ఉత్తర్వులు జారీ

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు లేకపోవడంతో బోధనకు ఆటంకం కలుగకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామని పేర్కొన్నారు.
News November 10, 2025
భారీ జీతంతో ESIC నోయిడాలో ఉద్యోగాలు

<


