News November 10, 2025

శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఎంత ఉన్నాయో తెలుసా..!

image

శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ (శ్రీవాణి) ద్వారా భక్తులు రూ.10వేలు విరాళం ఇస్తారు. వారికి బ్రేక్ దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. ఇప్పటి వరకు రూ. 2300 కోట్లు విరాళాలు అందాయని ఇటీవల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందులో రూ.600 కోట్లు ఖర్చు కాగా.. రూ. 1700 కోట్లు ఉన్నాయి. తాజాగా 5వేల ఆలయాల నిర్మాణాలకు సంబంధించి రూ. 750 కోట్లు టీటీడీ బోర్డు మంజూరు చేసింది.

Similar News

News November 10, 2025

NGKL: ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

NGKL కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 51 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పెండింగ్‌లో పెట్టకుండా, వెంటనే పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని, అందుకే అన్ని శాఖల అధికారులు వాటిపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

News November 10, 2025

410కి పైగా ఎంవోయూలపై సంతకాలు: విశాఖ ఎంపీ

image

సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈనెల 12న బీచ్ రోడ్, 17న గాజువాకలో యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ భరత్ తెలిపారు. ఈనెల 14,15 తేదీల్లో జరిగే CII సమ్మిట్‌లో 410కి పైగా MOUలు, రూ.9.8లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయన్నారు. YCP పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని, పెట్టుబడులు రావడం వారికి ఇష్టం లేదన్నారు. విధ్వంసం, నాశనం చేయడంలో వైసీపీ పీహెచ్డీ చేసిందని మండిపడ్డారు.

News November 10, 2025

జూబ్లీహిల్స్.. వెరీ లేజీ!

image

జూబ్లీహిల్స్.. పేరుకే లగ్జరీ కానీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెరీ లేజీ. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా సగం మందే ఓట్లు వేస్తున్నారు. 2023లో 47.58%, 2018లో 47.2% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ రోజు ప్రభుత్వం హాలిడే ప్రకటిస్తున్నా ఓటు వేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. ఈ ఉపఎన్నిక కీలకంగా మారడంతో ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.