News November 10, 2025
AP న్యూస్ అప్డేట్స్

* తిరుపతి(D)లో రాయలచెరువు కట్ట తెగి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 960 కుటుంబాలకు రూ.3వేల చొప్పున, మరణించిన 1,100 పశువులకు రూ.2.95 కోట్ల పరిహారం ఇవ్వనుంది.
* తిరుమల పరకామణి చోరీ కేసులో భాగంగా అప్పటి తిరుమల వన్టౌన్ పోలీసులు, TTD VGOగా పనిచేసిన గిరిధర్ను ఇవాళ CID విచారించింది.
* విశాఖ CII సమ్మిట్లో 400+ ఒప్పందాలు జరుగుతాయి. ₹లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి: విశాఖ MP శ్రీభరత్
Similar News
News November 10, 2025
అత్యంత స్వచ్ఛమైన గాలి లభించే నగరాలివే!

ప్రస్తుతం చాలా నగరాలను గాలి కాలుష్యం వెంటాడుతోంది. AQI లెవెల్స్ భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఏకంగా 500+AQI నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియాలో స్వచ్ఛమైన గాలి లభించే టాప్-5 నగరాలేవో తెలుసుకుందాం. 1. షిల్లాంగ్(మేఘాలయ)-12, 2.అహ్మద్నగర్(MH)-25, 3.మధురై(TN)-27, 4. మీరా భయందర్(MH)-29, 5. నాసిక్(MH)- 30 ఉన్నాయి. కాగా హైదరాబాద్లో 140+ AQI నమోదవుతోంది.
News November 10, 2025
రేపే పోలింగ్.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

TG: రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో కలెక్టర్ హరిచందన ఇప్పటికే సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ ఆఫీసులకు ఈ హాలిడే వర్తిస్తుంది. అటు ఈ నెల 14న కౌంటింగ్ జరిగే చోట సెలవు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు.
News November 10, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

✦ విశాఖలో రియాల్టీ లిమిటెడ్ ఐటీ పార్క్, రహేజా సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
✦ ఓర్వకల్లులో డెడికేటెడ్ డ్రోన్ ఇండస్ట్రీస్కు 50ఎకరాలు, సిగాచీ సింథటిక్ ఆర్గానిక్ ప్లాంటుకు 100Acre, అనకాపల్లి(D)లో డోస్కో ఇండియాకు 150Acre, అనంతపురంలో TMT బార్ ప్లాంటుకు 300Acre, నెల్లూరులో ఫైబర్ సిమెంట్ ప్లాంట్ కోసం బిర్లా గ్రూపుకు భూమి కేటాయింపు
✦ కృష్ణా(D) బాపులపాడులో వేద ఇన్నోవేషన్ పార్క్(40Acre) ఏర్పాటు


