News November 10, 2025

జగిత్యాల: ‘రూ.100 కోట్ల భూకబ్జాపై విచారణ వేగవంతం చేయండి’

image

జగిత్యాల పట్టణంలో సంచలనంగా మారిన రూ.100 కోట్ల భూకబ్జాపై వేగవంతంగా విచారణ జరపాలని మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కొత్త బస్టాండ్ పరిసర సర్వే నం.138 సహా పలు భూములు అన్యాక్రమణకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించబడితే స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై వివిధ రాజకీయ వర్గాల మద్దతు లభిస్తోంది.

Similar News

News November 10, 2025

ఎంజీఎంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: శేషు

image

ఉత్తర తెలంగాణలో పేదలకు వైద్య సేవలు అందించే ఎంజీఎంలో సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రజావేదిక రాష్ట్ర ఛైర్మన్ తిరునహరి శేషు అన్నారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్‌కి విజ్ఞప్తి చేశారు. ఎంజీఎం హాస్పిటల్‌పై కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి హాస్పటల్లో మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు చేపట్టాలని, పూర్తిస్థాయిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్లనే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

News November 10, 2025

పోలీసు ప్రధాన కార్యాలయానికి 66 వినతులు: SP

image

పుట్టపర్తిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి సోమవారం 66 వినతులు అందినట్లు SP సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రాధాన లక్ష్యమన్నారు. ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, సైబర్ నేరాలు అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వరం న్యాయం చేస్తామన్నారు.

News November 10, 2025

HYD: అందెశ్రీకి సీపీ సజ్జనర్ నివాళి

image

HYD లాలాపేటలోని GHMC ఆచార్య జయశంకర్ గ్రౌండ్‌లో ప్రముఖ కవి అందెశ్రీ భౌతికకాయానికి హైదరాబాద్ సీపీ సజ్జనర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. తెలంగాణ రచయిత, గొప్ప ఉద్యమకారుడు, జయ జయహే తెలంగాణ గీతం రాసిన కవి మరణించడం బాధాకరమని అన్నారు.