News April 11, 2024
కర్నూలు: ఈనెల 16న వైఎస్ షర్మిల ప్రచార యాత్ర

ఈనెల 16న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రచార యాత్రను ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. నంద్యాల జిల్లాలోని బ్రాహ్మణ కొట్టుకూరు నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని గార్గేయపురంలోకి ప్రచార యాత్ర ప్రవేశిస్తుంది. అదే రోజు కర్నూలులో రోడ్ షో నిర్వహించిన అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. 17న పాణ్యం, డోన్ నియోజకవర్గాల్లో పర్యటించి, సాయంత్రం 6 గంటలకు కోడుమూరులో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహిస్తారు.
Similar News
News March 22, 2026
కర్నూలు: ప్రమాదంలో 19 ఏళ్ల యువకుడి మృతి

గోనెగండ్ల మండలం వేముగోడులో మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రవిరెడ్డి పొలంలో కాంట్రాక్టర్ బావన్న నీళ్ల బావిని JCBతో తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లో నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ, ఇంజన్కు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది. దీంతో ట్రాక్టర్పై కూర్చున్న సాదిక్ బాషా(19) తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
News March 22, 2026
గ్యాస్కు ప్రత్యామ్నాయాలపై కలెక్టర్ దృష్టి

జిల్లాలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించి ఇండక్షన్ స్టవ్లు, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్లు వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గ్యాస్ కొరత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ పరికరాల లభ్యత, ధరలు, సరఫరాపై పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. అవసరమైతే కిరోసిన్ స్టౌవ్ల డేటాను కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై ప్రణాళిక అందించాలన్నారు.
News March 22, 2026
ఈ నెల 26న జిల్లాస్థాయి ఉషూ పోటీలు

ఈనెల 26న కర్నూలులోని కిడ్స్ వరల్డ్ రోశయ్య కమ్యూనిటీ హాలులో 8వ జిల్లాస్థాయి ఉషూ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి టి.శ్రీనివాసులు తెలిపారు. పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.


