News November 10, 2025
రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా

చిన్నతనం నుంచే అంతరిక్షంపై మక్కువ పెంచుకుని శాస్త్రవేత్త కావాలనుకున్నారు రీతూ కరిధాల్. లక్నోలో జన్మించిన ఈమె 1997లో ఇస్రోలో చేరారు. చంద్రయాన్-2కు మిషన్ డైరక్టర్గా వ్యవహరించడంతో పాటు మార్స్ ఆర్బిటార్, మంగళయాన్, చంద్రయాన్-3లో ప్రధానపాత్ర పోషించారు. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా బిరుదుతోపాటు అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఇస్రోయంగ్ సైంటిస్ట్ అవార్డు, ఫోర్బ్స్ ఇండియా సెల్ఫ్ మేడ్ ఉమెన్-2020 జాబితాలో నిలిచారు.
Similar News
News November 10, 2025
భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.
News November 10, 2025
ఢిల్లీ పేలుడు.. విచారణకు ఆదేశించిన హోంమంత్రి

ఢిల్లీ పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్, ఢిల్లీ సీపీతో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే NSG, NIA టీమ్స్ ఘటనాస్థలికి చేరుకున్నాయి. అటు పేలుడులో 8 మంది మరణించగా, 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. కార్లు, దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎర్రకోట వద్ద భీతావహ వాతావరణం నెలకొంది.
News November 10, 2025
రహదారి పక్కన ఇంటి నిర్మాణానికి నియమాలు

రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటే, ఆ దారి కొలతకు ఇంటి పొడవు రెండింతల కంటే ఎక్కువ ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ నియమం ఇంటికి, బయటి శక్తి ప్రవాహానికి మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని అంటారు. ‘ఇంటి పొడవు అధికంగా ఉంటే.. అది రోడ్డు నుంచి వచ్చే చంచల శక్తిని ఎక్కువగా ఆకర్షించి, ఇంట్లో స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. గృహంలో ప్రశాంతత ఉండాలంటే ఈ నియమం పాటించాలి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>


