News November 10, 2025
KMR: కలెక్టరేట్లో ప్రజావాణికి 80 అర్జీలు

కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ద్వారా 80 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, అర్జీదారుల సమస్యలను ఓపికగా విన్నారు. అనంతరం ఆయన సంబంధిత జిల్లా అధికారులకు దరఖాస్తులను అందజేశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. పరిధిలో పరిష్కరించలేని సమస్యలపై దరఖాస్తుదారులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.
Similar News
News November 10, 2025
MNCL: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

మంచిర్యాలలోని సైన్స్ కేంద్రంలో సోమవారం జిల్లా స్థాయి వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. జిల్లాలోని 18 మండలాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. వ్యాసరచన పోటీలో అక్షర, ఉపన్యాస పోటీలో శ్రీవిద్య, క్విజ్ పోటీలో శివజ్యోతి, అఖిల్, కీర్తన, సుశాంత్, అక్షిత, టాలెంట్ టెస్ట్లో ఎండీ అతిఫా ప్రథమ బహుమతులు సాధించారు. ఇందులో అక్షర, శ్రీవిద్య, అతిఫా రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
News November 10, 2025
శ్రీరాంపూర్: స్ట్రక్చర్ సమావేశంలో పలు ఒప్పందాలు

గుర్తింపు ఏఐటీయూసీ సంఘం, సింగరేణి యాజమాన్యంకు Hydలో జరిగిన స్ట్రక్చర్ కమిటీలో పలు ఒప్పందాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. 150 మస్టర్ల ఆప్సెంటేజం సర్కులర్పై గత విధానాన్ని కొనసాగించడానికి అంగీకరించారు. బదిలీ వర్కర్లుగా అపాయింట్మెంట్ అవుతున్న ఉద్యోగులందరూ జనరల్ అసిస్టెంట్ ట్రేనీగా నియమించబడతారు. మెడికల్ బోర్డు, ప్రభుత్వ అనుమతి అనంతరం పెరిక్స్పై ఐటీ యాజమాన్యమే భరిస్తుంది.
News November 10, 2025
భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు చేయొద్దు!

భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయవద్దని, దానివల్ల ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు.
*స్నానం చేయవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. 2 గంటల తర్వాత స్నానం చేయవచ్చు.
*వెంటనే నిద్రపోవద్దు. 20 నిమిషాల పాటు నడవాలి.
*చల్లటి నీరు తాగవద్దు. గోరువెచ్చని లేదా జీలకర్ర-ధనియాల కషాయం తాగాలి.
*తిన్న వెంటనే పండ్లు తినవద్దు. గంట ముందు లేదా 2 గంటల తర్వాత తినొచ్చు.
*వ్యాయామం చేయవద్దు.


