News April 11, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్త పోలింగ్ కేంద్రాలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో 3,303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రాల సంఖ్య 4,004లకు చేరింది. ఈ ఐదేళ్లలో 701 కేంద్రాలు పెరిగాయి. సగటున ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున కేంద్రాలు పెంచారు. ఏటా చనిపోయినవారు, స్థానికంగా లేనివారి ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా చాలామంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

Similar News

News April 22, 2025

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

image

MBNR ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన 92 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని అధికారులను అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశంలో ఫిర్యాదులను స్వీకరించారు. ఏ వారం ఫిర్యాదులను ఆ వారమే పరిష్కరించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

News April 22, 2025

రైతుల దగ్గరికే అధికారులు: కలెక్టర్ విజయేంద్ర

image

మే1 నుంచి ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారులు వచ్చి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి తెలిపారు. భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా భూభారతి చట్టం కింద వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని అన్నారు. అడ్డాకులలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. ఈ పోర్టల్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

News April 22, 2025

MBNR: వేసవి కరాటే శిక్షణ శిబిరం

image

వేసవి కరాటే శిక్షణ శిబిరానికి సద్విని చేసుకోవాలని ఉమ్మడి ఒలంపిక్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ పి వెంకటేష్ కోరారు. వారు కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ.. విద్యార్థులు యువత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. మార్షల్ ఆర్ట్స్ తో శారీరకంగా మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగవచ్చు అన్నారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 30 నుంచి జూన్ 11 వరకు నిర్వహిస్తున్నామన్నారు.

error: Content is protected !!