News November 10, 2025
PDPL: అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

పెద్దపల్లి ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష సోమవారం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను సత్వరమే పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన హౌసింగ్, భూమి నమోదు, వితంతు పెన్షన్, కుటుంబ వివాదాలపై దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ డి.వేణు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ బి.వనజా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 11, 2025
భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.
News November 11, 2025
జడేజా-శాంసన్ స్వాపింగ్ నిజమే!

IPLలో CSK, RR జట్ల మధ్య ట్రేడ్ టాక్స్ నిజమేనని Cricbuzz పేర్కొంది. ఓ ఫ్రాంచైజీ ఆఫీసర్ దీనిని ధ్రువీకరించినట్లు వెల్లడించింది. RR నుంచి శాంసన్ CSKకి, చెన్నై నుంచి రాజస్థాన్కు జడేజా, సామ్ కరన్ మారతారని తెలిపింది. ఇప్పటికే ఈ ముగ్గురు ప్లేయర్లు ఇందుకు అంగీకరించి సంతకాలు చేశారని వివరించింది. స్వాప్ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకొంత సమయం పడుతుందని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొంది.
News November 11, 2025
జగిత్యాలలో నేటి మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,201, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,961, కనిష్ఠ ధర రూ.1,810, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,930, వరి ధాన్యం(HMT) ధర రూ.2,261, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,631, కనిష్ఠ ధర రూ.1,951గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.


