News November 10, 2025
అన్నమయ్య: దత్తత అవగాహన కార్యక్రమం-2025 గోడపత్రికల విడుదల

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అన్నమయ్య జిల్లా ఆధ్వర్యంలో ‘దత్తత అవగాహన కార్యక్రమం-2025’ గోడపత్రికలను జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు PGRS సమావేశ మందిరంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నవంబర్లో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు కుటుంబ ఆధారిత సంరక్షణ అందించాలాన్నారు.
Similar News
News November 11, 2025
TODAY HEADLINES

➤ ఢిల్లీలో పేలుడు.. 13 మంది మృతి, దేశవ్యాప్తంగా హైఅలర్ట్
➤ పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: అమిత్ షా
➤ రచయిత అందెశ్రీ కన్నుమూత.. రేపు అంత్యక్రియలు
➤ స్పీకర్పై సుప్రీంకోర్టులో BRS కోర్టు ధిక్కార పిటిషన్
➤ రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం
➤ వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపినట్లు CBI సిట్ తేల్చింది: TDP
News November 11, 2025
HYD: అనుమానాస్పద స్థితిలో యువకుడి ఆత్మహత్య

రాజేంద్రనగర్ హనుమాన్నగర్ ప్రాంతానికి ధనుష్ కుమార్(22) హౌస్ కీపింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఆస్పత్రికి వెళ్లి వస్తానని తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని బయటికి వెళ్లాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రితోపాటు చుట్టు పక్కల వెతికారు. సోమవారం వాలంతరి ఏపీఈఆర్ఎల్ వెనుక చెట్టుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 11, 2025
SRCL: చిన్న నీటి పారుదల వవరులపై సమీక్ష సమావేశం

చిన్న నీటి పారుదల వనరుల సర్వే పకడ్బందీగా చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. చిన్న నీటి పారుదల వనరుల సర్వేపై డీఆర్డీఓ, వ్యవసాయ, ఈఈ పీఆర్, నీటి పారుదల శాఖ, సెస్, సీపీఓ తదితర శాఖల డిస్ట్రిక్ట్ లెవెల్ స్టీరింగ్ కమిటీ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడారు.


