News November 10, 2025

శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

image

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్‌లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.

Similar News

News November 11, 2025

నవంబర్ 11: చరిత్రలో ఈరోజు

image

1888: స్వాతంత్ర్య సమర యోధుడు, భారత తొలి విద్యా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జననం (ఫొటోలో)
1917: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్.రంగా జననం
1970: రచయిత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మాడపాటి హనుమంతరావు మరణం
1974: హాస్య నటుడు తిక్కవరపు వెంకట‌రమణారెడ్డి మరణం
1994: భారత క్రికెటర్ సంజూ శాంసన్ జననం
2023: నటుడు చంద్రమోహన్ మరణం
* జాతీయ విద్యా దినోత్సవం

News November 11, 2025

VER అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి: చంద్రబాబు

image

AP: శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విశాఖ ఎకానమిక్ రీజియన్(VER) అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలన్నారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. స్టేట్ హెల్త్ కేర్ పాలసీతో మెడికల్ టూరిజంను లింక్ చేయాలని సీఎం తెలిపారు.

News November 11, 2025

గోదావరిఖనిలో బయటపడ్డ అష్టభుజాల సింహవాహిని

image

రామగుండం ఎన్టీపీసీ ఏరియా సోలార్‌ ప్లాంట్‌ పక్కనే ఉన్న ఏరియాలో అష్టభుజాలతో సింహవాహిని దుర్గాదేవి విగ్రహం బయటపడింది. విగ్రహం గుర్తించిన స్థానికులు విషయాన్ని హిందూ వాహిని శ్రేణులకు తెలపడంతో వారు అర్చకులు సతీష్‌ శాస్త్రితో ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి విగ్రహాన్ని పాలతో సంప్రోక్షణ చేసి, పసుపుకుంకుమలను సమర్పించి ప్రత్యేక హారతులు సమర్పించారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.