News April 11, 2024
MBNR: రైళ్లలో హిజ్రాలు వేధింపులు

MBNR రైల్వే స్టేషన్ మీదుగా ప్రయాణించే రైళ్లలో ప్రయాణికుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ హిజ్రాలు ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు ఇవ్వని వారిని అవహేళన చేయటం, తిట్టడం, వెకిలి చేష్టలతో అపహాస్యానికి దిగటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే పోలీసుల ఉదాసీన వైఖరివల్ల హిజ్రాలు రెచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. డివిజన్ అధికారులు వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News March 30, 2026
MBNR: ఇప్ప సారాయి సాధ్యమేనా? కనుమరుగైన చెట్లు!

ఇప్ప సారాయి అమ్మకాలు జరపాలని ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రజల్లో భిన్న వాదన మొదలైంది. నియోజకవర్గంలో ఒకప్పుడు గుట్టలు మైదాన ప్రదేశాలు ఉండడంతో విపరీతంగా విప్ప పువ్వు చెట్లు ఉండేవని.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మాయలో గుట్టలు, పొలాలు మాయమై వెంచర్లుగా వెలిశాయని విప్ప చెట్లు లేవని చర్చించుకుంటున్నారు. చెట్లు పెంచాలంటే పదేళ్లు పడతాదన్నారు.
News March 30, 2026
MBNR: ఇప్ప సారాయి సాధ్యమేనా? కనుమరుగైన చెట్లు!

ఇప్ప సారాయి అమ్మకాలు జరపాలని ఇటీవలే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ప్రజల్లో భిన్న వాదన మొదలైంది. నియోజకవర్గంలో ఒకప్పుడు గుట్టలు మైదాన ప్రదేశాలు ఉండడంతో విపరీతంగా విప్ప పువ్వు చెట్లు ఉండేవని.. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మాయలో గుట్టలు, పొలాలు మాయమై వెంచర్లుగా వెలిశాయని విప్ప చెట్లు లేవని చర్చించుకుంటున్నారు. చెట్లు పెంచాలంటే పదేళ్లు పడతాదన్నారు.
News March 29, 2026
పాలమూరు: లోక్ అదాలత్..UPDATE!!

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలో ఉన్న మొత్తం 3,416 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. ఐపీసీ (IPC) కేసులు-524, డీడీ (DD) కేసులు – 794, ఈపెట్టీ (e-Petty) కేసులు – 1,979 సైబర్ క్రైమ్ కేసులు-119 ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు ఎస్పీ వెల్లడించారు.


