News November 11, 2025
KMR: వీధి కుక్కల బెడదకు చెక్ పడుతుందా?

వీధి కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జన రద్దీ ఉండే ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కామారెడ్డి జిల్లాలో కూడా వీధి కుక్కల దాడికి గురై అనేక మంది గాయాలపాలైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 11, 2025
ఏపీ అప్డేట్స్

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ
News November 11, 2025
‘విశాఖ వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి’

CII పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాట్ల నేపథ్యంలో విశాఖ CP కార్యాలయంలో ఇన్ఛార్జ్ CP గోపినాథ్ జెట్టి సోమవారం పోలీస్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. సమ్మిట్ కోసం నగరానికి రానున్న దేశ విదేశాల ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖల కోసం తీసుకోవలసిన భద్రత చర్యలపై పలు సూచనలు చేశారు. నగరంలోకి ప్రవేశించే అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు.ట్రాఫిక్ జామ్లు కాకుండా చూడాలన్నారు.
News November 11, 2025
కేంద్ర బృందం తుఫాన్ నష్టాన్ని తీర్చేనా…!

బాపట్ల జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా భారీగా నష్టం చేకూరిందని అధికారుల ప్రాథమిక అంచన వేసిన విషయం తెలిసిందే. జిల్లాలో 80,467 ఎకరాలలో పంటకు నష్టం వాటిల్లింది. రోడ్లు, కాలువలు దాదాపుగా అన్ని ప్రాంతాలు కోతకు గురయ్యాయి. చాలామంది గుడిసెలలో నివసించే నిరుపేద ప్రజలు వరద కారణంగా తమ నివాసాలను కోల్పోయామన్నారు. కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించి తుఫాన్ నష్టాన్ని తీరుస్తుందా అని ప్రజలు అంటున్నారు.


