News November 11, 2025

నేడు బాపట్లలో పర్యటించనున్న కేంద్ర బృందం: కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో మంగళవారం కేంద్ర బృందం పర్యటించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో దెబ్బతిన్న ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలన చేయనుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ తయారు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News November 11, 2025

కోడిగుడ్డు పెంకుతో ఇన్ని లాభాలా!

image

కోడిగుడ్డులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని పిల్లలకు ఉడికించిన గుడ్లు ఇస్తుంటారు. అయితే, కేవలం గుడ్డులోపల ఉన్న పదార్థం మాత్రమే కాదు.. బయట ఉండే పెంకుతోనూ చాలా లాభాలు ఉంటాయి.- కోడిగుడ్డు పెంకులను పడేయకుండా మొక్కల కుండీల్లో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి. -గుడ్డు పెంకులను మెత్తగా చేసి తేనె కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరుస్తుంది. – పెంకుల పొడిలో బేకింగ్ సోడా, కొబ్బరినూనె కలిపి అప్లై చేస్తే దంతాలు మెరుస్తాయి.

News November 11, 2025

కావలి: వృద్ధురాలిపై అఘాయిత్యానికి యత్నం

image

వృద్ధురాలిపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి యత్నించిన ఘటన కావలి మండలంలో జరిగింది. కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మనోజ్ ప్రభాకర్ వృద్ధురాలి(75) ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి అతడు పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు.

News November 11, 2025

గట్టు: ‘అమ్మ భవాని వసూళ్లు’ వదంతులపై ఎస్సై ఖండన

image

గట్టు మండల కేంద్రంలో శ్రీ అమ్మ భవాని జాతర పేరుతో ‘గలీజ్ దందా అంటూ గద్వాల సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వదంతులను గట్టు ఎస్సై కేటి మల్లేష్ ఖండించారు. ఎస్సై మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చిన పుకార్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. రికార్డింగ్ డ్యాన్స్ పెట్టించే ఉద్దేశంతో కొందరు ఈ వసూళ్లకు పాల్పడినట్లు ప్రాథమికంగా తమ దృష్టికి వచ్చిందన్నారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.