News November 11, 2025
తాకట్టు పత్రాలు ఇవ్వని ఎస్బీఐకి భారీ జరిమానా

రుణం తీరినా ఆస్తి పత్రాలు ఇవ్వని వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఎస్బీఐ బ్యాంకుపై కన్స్యూమర్ కోర్టు చర్యలు తీసుకుంది. వినియోగదారుడు డి. మల్లేశం ఫిర్యాదు మేరకు.. పత్రాలు ఇచ్చేవరకు రోజుకు రూ.5 వేలు, మానసిక వేదనకు రూ.లక్ష, కోర్టు ఖర్చులుగా రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును కోర్టు ఆదేశించింది.
Similar News
News November 11, 2025
శ్రీసిటీలో రూ.1629 కోట్ల పెట్టుబడి.. 2,630 మందికి జాబ్స్

రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా నిన్న మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో శ్రీసిటీలో SCIC వెంచర్స్ LLP రూ.550 కోట్ల పెట్టుబడితో ACల్లో వినియోగించే PCBA, BLDC మోటార్ల తయారీ యూనిట్ను స్థాపించనుంది. క్రయో నెక్స్ట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,079 కోట్ల పెట్టుబడితో IT ఎన్క్లోజర్లు, PCB బేర్ బోర్డుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనుంది.
News November 11, 2025
సూర్యాపేట జిల్లాలో మంచిర్యాల వాసి మృతి

మంచిర్యాలలోని రాజీవ్నగర్కు చెందిన ఈటే శ్రీకాంత్ అనే యువకుడు సూర్యాపేట జిల్లాలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల చెన్నై వెళ్లి లారీ లోడ్తో తిరిగి వస్తున్న క్రమంలో ఈనెల 9న గరిడేపల్లి మండలం మర్రికుంట సమీపంలో సాగర్ ఎడమ కాలువ వద్ద ఆగారు. సరదాగా ఈత కొట్టేందుకు కాలువలోకి దూకిన శ్రీకాంత్ గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టగా సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది.
News November 11, 2025
మెదక్: చేగుంటలో చిరుత పులి మృతి

చేగుంట మండలం గొల్లపల్లి తండా, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన <<18254855>>చిరుత పులి <<>> మంగళవారం ఉదయం మృతి చెందింది. నిన్న సాయంత్రం చెట్ల పొదల్లో కదలలేని స్థితిలో కనిపించిన చిరుతను గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయానికి మృతి చెందిన చిరుతపులిని గొడుగుపల్లి శివారులో గుర్తించారు. అటవీ అధికారులు విచారణ చేస్తున్నారు.


