News April 11, 2024
రంజాన్ మాసంలో బిర్యానీదే అగ్రస్థానం
రంజాన్ మాసంలో బిర్యానీ ఆర్డర్లు భారీగా పెరిగినట్లు ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. గత నెల 12 నుంచి ఈ నెల 8వరకు స్విగ్గీ ఆర్డర్ల జాబితాను సంస్థ విడుదల చేసింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా నెల రోజుల వ్యవధిలో 60 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. వాటిలో 10 లక్షలు హైదరాబాద్లోనే ఉండటం విశేషం. ఇక హలీమ్ ఆర్డర్లు 1454శాతం, ఫిర్ని 80.97శాతం, మాల్పువా 79.09శాతం పెరిగినట్లు స్విగ్గీ తెలిపింది.
Similar News
News October 11, 2024
స్విగ్గీ బాయ్కాట్ నిర్ణయం వెనక్కి
AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
News October 11, 2024
ఎన్కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ
ఈ నెల 5న ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
News October 11, 2024
మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.