News November 11, 2025
ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం: కలెక్టర్

జిల్లాలో పంట నష్టాలను తగ్గించి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా సిల్వర్ ఓక్కు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. కాఫీ తోటలను తెగుళ్ల బెడద నుంచి రక్షించేందుకు అవకాడో, లిచీ, జాక్ ఫ్రూట్, స్వీట్ ఆరంజ్ వంటి విలువైన పంటలను ప్రోత్సహించాలన్నారు. రైతులకు స్థిరమైన ఆదాయం, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే పంటలే లక్ష్యం అన్నారు.
Similar News
News November 11, 2025
రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి
News November 11, 2025
రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: TDP

AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని TDP ట్వీట్ చేసింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం జరిగినట్లు వివరించింది. ‘ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమీషన్ కోసమే జరిగిందా? ఇంకేదైనా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది. రెండేళ్ల పాటు లడ్డూ పవిత్రత దెబ్బతిందని, ఇది పాపం కాదా? అని ప్రశ్నించింది.
News November 11, 2025
IIIT కళ్యాణిలో ఉద్యోగాలు

<


