News November 11, 2025

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఆపాలి..!

image

గద్వాల్ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ-యశ్వంతపూర్ వందేభారత్ రైలును ఆపాలని ప్రయాణికులు కోరుతున్నారు. అత్యవసర సమయంలో వందేభారత్ వంటి అధునాతన రైలు గద్వాల్‌లో ఆగితే అభివృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. గద్వాల్ నుంచి అనంతపురం, బెంగుళూరు వంటి ప్రాంతాలకు వేగంగా ప్రయాణించడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. రైల్వే అధికారులు స్పందించి హాల్ట్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్..!

Similar News

News November 11, 2025

రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్‌లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి

News November 11, 2025

రూ.250 కోట్లలో జగన్ వాటా ఎంత: TDP

image

AP: టీటీడీకి 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని TDP ట్వీట్ చేసింది. దాని విలువ రూ.240.80 కోట్లు అంటే సుమారు రూ.250 కోట్ల కుంభకోణం జరిగినట్లు వివరించింది. ‘ఇందులో జగన్ వాటా ఎంత? జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వాటా ఎంత? అసలు ఇది కమీషన్ కోసమే జరిగిందా? ఇంకేదైనా కుట్ర ఉందా?’ అని ట్వీట్ చేసింది. రెండేళ్ల పాటు లడ్డూ పవిత్రత దెబ్బతిందని, ఇది పాపం కాదా? అని ప్రశ్నించింది.

News November 11, 2025

IIIT కళ్యాణిలో ఉద్యోగాలు

image

<>IIIT కళ్యాణి,<<>> పశ్చిమబెంగాల్‌లో 6 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 23వరకు అప్లై చేసుకోవచ్చు. డిప్యూటీ రిజిస్ట్రార్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి PG, CA/ICWA, ME, M.Tech, MSc, MCA, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: iiitkalyani.ac.in