News April 11, 2024
అవనిగడ్డ ఎవరి అడ్డా!
AP: కృష్ణా జిల్లా డెల్టా ప్రాంతమైన అవనిగడ్డ ఆరు మండలాలతో అతిపెద్ద నియోజకవర్గంగా ఉంది. 1962లో ఈ సెగ్మెంట్ ఏర్పడగా.. కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 6 సార్లు, వైసీపీ ఒకసారి నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేస్తోంది. టీడీపీ నుంచి పార్టీలో చేరిన సీనియర్ లీడర్ మండలి బుద్ధ ప్రసాద్ను జనసేన పోటీ చేయిస్తోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు మరోసారి బరిలో నిలిచారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 11, 2024
స్విగ్గీ బాయ్కాట్ నిర్ణయం వెనక్కి
AP: ఈ నెల 14 నుంచి స్విగ్గీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ <<14272365>>బాయ్కాట్<<>> చేయాలన్న నిర్ణయాన్ని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వెనక్కి తీసుకుంది. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
News October 11, 2024
ఎన్కౌంటర్ మృతులు 34: బస్తర్ ఐజీ
ఈ నెల 5న ఛత్తీస్గఢ్లోని దంతెవాడ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన వారి సంఖ్య 34 అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. తాము 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన 3 మృతదేహాలను మావోయిస్టులు అడవిలోనే ఖననం చేసినట్లు పేర్కొన్నారు.
News October 11, 2024
మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ
బంగ్లాదేశ్లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.