News November 11, 2025

సూర్యాపేట జిల్లాలో మంచిర్యాల వాసి మృతి

image

మంచిర్యాలలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఈటే శ్రీకాంత్ అనే యువకుడు సూర్యాపేట జిల్లాలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ పనిచేస్తున్న శ్రీకాంత్ ఇటీవల చెన్నై వెళ్లి లారీ లోడ్‌తో తిరిగి వస్తున్న క్రమంలో ఈనెల 9న గరిడేపల్లి మండలం మర్రికుంట సమీపంలో సాగర్ ఎడమ కాలువ వద్ద ఆగారు. సరదాగా ఈత కొట్టేందుకు కాలువలోకి దూకిన శ్రీకాంత్ గల్లంతయ్యాడు. పోలీసులు గాలింపు చేపట్టగా సోమవారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది.

Similar News

News November 11, 2025

ఆర్టీసీకి కార్గో లాభాల పంట!

image

విజయవాడ RTC జోనల్‌లో కార్గో సేవలు లాభాల పంట పండిస్తున్నాయి. గత ఏడాది మొత్తం రూ.114 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది అక్టోబర్ నాటికే రూ. 120 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. కొబ్బరి, అరటి పంట, ఇతర సరుకులను నేరుగా మార్కెట్ నుంచే రవాణా చేయడంతో లాభాలు పెరిగాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇంటికి వచ్చి పార్సెల్ పికప్ చేసుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలో RTC ఉన్నట్లు తెలుస్తోంది.

News November 11, 2025

ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

image

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉండవల్లికి బయలుదేరారు.

News November 11, 2025

భవిష్యత్తు బంగారం ‘రాగి’: అనలిస్టులు

image

ఈవీలు, సోలార్ ప్యానెల్స్, 5G టవర్లు, డేటా సెంటర్ల నిర్మాణంలో ఉపయోగించే రాగి విలువ పెరుగుతోందని అనలిస్టులు చెబుతున్నారు. ప్రధాన ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఇండోనేషియాలోని కాపర్ మైన్స్ వరదలు, ప్రమాదాలతో షట్‌డౌన్ అంచున ఉన్నాయి. 2026కు 6 లక్షల టన్నుల రాగి కొరత ఏర్పడవచ్చు. కొత్త మైన్స్ తెరిచేందుకు 10-15 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో టన్ను రాగి 11-14 వేల డాలర్లకు చేరుకోవచ్చని చెబుతున్నారు.