News November 11, 2025

వరంగల్: శాఖల మధ్య సమన్వయం లోపం.. వారికి బంపర్ ఆఫర్

image

2024 DSC టీచర్ పోస్టులు, స్పోర్ట్స్ కోటా SGTపోస్టుల నియామకాల్లో జాతీయ క్రీడాకారులకు అన్యాయం చేశారనే ఆరోపణలపై ప్రభుత్వం ఇటీవల రీవెరిఫికేషన్‌కు ఆదేశించింది. విచారణలో 22మంది అనర్హులని తేలింది. విద్యా, స్పోర్ట్స్ శాఖల మధ్య సమన్వయ లోపంతో అర్హత లేనివారు కొలువు చేస్తున్నారు. నివేదికను బయటపెడితే అక్రమార్కుల జాబ్స్ తీసేయాల్సి వస్తుందనే నెపంతో ఈ ఫైల్‌ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Similar News

News November 11, 2025

రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారా?

image

AFG క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. NEDలో జరిగిన ఈవెంట్‌లో రషీద్ ఓ అమ్మ‌ాయితో కనిపించగా ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై రషీద్ స్పందిస్తూ ‘2025 AUG 2న నా లైఫ్‌లో కొత్త చాప్టర్ మొదలైంది. ఈవెంట్‌లో నాతో ఉన్నది నా భార్యే’ అని తెలిపారు. కాగా 2024 OCTలోనూ రషీద్‌కు మ్యారేజ్ అయినట్లు వార్తలు రావడంతో ఇది రెండో పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News November 11, 2025

18న రాష్ట్రపతి నుంచి అవార్డ్ అందుకోనున్న కలెక్టర్

image

నీటి సంరక్షణ కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన నెల్లూరు జిల్లాకు దేశ స్థాయిలో ‘జల్ సంచయ్ జన్ భగీధారి 1.0’ నేషనల్ అవార్డు లభించింది. నవంబర్ 18న న్యూఢిల్లీలో ఈ అవార్డును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులు మీదుగా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుకోనున్నారు. ఈ సందర్భంగా డ్వామా పీడీ గంగాభవాని కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు,

News November 11, 2025

ఖమ్మం డీఈఓగా చైతన్య జైనీ బదిలీ

image

ఖమ్మం జిల్లా నూతన విద్యాశాఖాధికారి (డీఈఓ)గా కరీంనగర్ డీఈఓ చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కరీంనగర్ డీఈఓగా బాధ్యతలు చేపట్టిన చైతన్య జైనీ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. కాగా, కరీంనగర్ డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ శ్రీరామ్ మొండయ్య కొనసాగనున్నారు.