News November 11, 2025

పెద్దపల్లి బస్టాండ్‌, రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు

image

పెద్దపల్లి పోలీసుల ఆధ్వర్యంలో డీసీపీ పీ.కరుణాకర్‌, ఏసీపీ గజ్జి కృష్ణ నేతృత్వంలో బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్‌ నేపథ్యంలో రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టారు. పెద్దపల్లిలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, వస్తువులు, బ్యాగులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Similar News

News November 11, 2025

వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ఎన్.తేజ్‌భరత్

image

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ కమినర్‌గా ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం మెప్మా డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కేఎస్ విశ్వనాథన్‌ను ఐఅండ్ పీఆర్ డైరెక్టర్‌గా బదిలీ చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

News November 11, 2025

GWL: రేబిస్ వ్యాధిపై అవగాహన ముఖ్యం

image

రేబిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ రేబిస్ దినోత్సవం (సెప్టెంబర్ 28)ను పురస్కరించుకొని మంగళవారం గద్వాల అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. రేబిస్ సోకే విధానం, నివారణ జాగ్రత్తలు, వీధి కుక్కలు కరిస్తే ప్రాథమిక చికిత్స అందించాల్సిన విధానం గురించి విద్యార్థులకు వివరించారు.

News November 11, 2025

అయిజ: ‘చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి’

image

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని బాస్కెట్‌బాల్ అసోసియేషన్ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, SI తరుణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయిజ మండలం ఉత్తనూర్ ZPHS ప్రాంగణంలో మంగళవారం SGF జిల్లాస్థాయి అండర్-14, అండర్-17 బాస్కెట్‌బాల్ క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయి పోటీలకు ఎంపికచేశారు.