News November 11, 2025
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్ VC

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్ష చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్, పీడీ హౌసింగ్తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
Similar News
News November 12, 2025
IPL: ఫ్రాంచైజీలు రిలీజ్ చేసేది వీరినేనా?

CSK: శంకర్, కాన్వే, హుడా, అశ్విన్, త్రిపాఠి
DC: ముకేశ్, చమీర, నటరాజన్, మోహిత్, డుప్లెసిస్
GT: రషీద్, షారుక్, ఇషాంత్, Tewatia
KKR: V iyer, అలీ, డికాక్, రమణ్
LSG: షమర్, సమద్, MI: D చాహర్, Topley, ముజీబ్
PBKS: Maxy, స్టొయినిస్, Ferguson, Jamieson
RR: మధ్వాల్, ఫారూఖీ, బర్గర్, తీక్షణ, Hetmyer, తుషార్
SRH: Ishan, shami, జంపా, అభినవ్, R చాహర్, హర్షల్
RCB: పడిక్కల్, షెపర్డ్, రసిఖ్, సుయాశ్, లివింగ్స్టోన్
News November 12, 2025
HYD: సరోజినీ దేవి ఆస్పత్రిలో కార్నియా మార్పిడి

HYD సరోజినీ దేవి హాస్పిటల్లో కార్నియా మార్పిడి చేస్తున్నారు. అయితే.. చనిపోయిన 6 గంటలలోపు సమాచారం ఇస్తే కార్నియాను తమ వైద్యులు సేకరిస్తారని పేర్కొన్నారు. కార్నియాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి 15 రోజుల్లో వేరోకరికి అమర్చుతామని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. దానం చేయాలనుకుంటే 9121433434 నంబర్లో సంప్రదించాలని ఆస్పత్రి సూపరిండెంట్ డా.మోదిని తెలిపారు.
News November 12, 2025
రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం: మంత్రి

విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగబోయే CII 30వ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి మేలు చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 30 మంది విదేశీ మంత్రులు పాల్గొననున్నారని చెప్పారు. మొత్తం 410 ఒప్పందాల ద్వారా రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నారు.


