News November 12, 2025

పాక్ ఆరోపణలు నిరాధారమైనవి: విదేశాంగ శాఖ

image

ఇస్లామాబాద్‌లో <<18261233>>దాడి<<>> వెనుక భారత్ హస్తం ఉందన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపణలను విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కొట్టిపారేశారు. ఆయనవి నిరాధారమైన ఆరోపణలు అని మండిపడ్డారు. ఆ దేశంలోని సైనిక పాలన తరహా విధ్వంసం, అధికార దోపిడి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పాక్ వ్యూహం పన్నిందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు వాస్తవం ఏంటో తెలుసని, పాక్ కుట్రల ద్వారా తప్పుదోవ పట్టవని తెలిపారు.

Similar News

News November 12, 2025

ఢిల్లీ బ్లాస్ట్‌‌కు టెలిగ్రామ్‌తో లింక్!

image

ఢిల్లీ బ్లాస్ట్‌లో కమ్యూనికేషన్ కోసం ఉగ్రవాదులు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. ఈ యాప్ ద్వారా రాడికల్ డాక్టర్లు గ్రూపుగా ఏర్పడి సమాచారాన్ని చేరవేసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఈ యాప్‌పై ఎప్పటినుంచో తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. కంటెంట్ నియంత్రణలో నిర్లక్ష్యంగా ఉంటుందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ యాప్ బ్యాన్ చేయాలనే దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.

News November 12, 2025

‘కాంత’ మూవీని నిషేధించాలని కోర్టులో పిటిషన్

image

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కాంత’ సినిమాను నిషేధించాలని చెన్నైలో కోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ అనుమతి లేకుండా సూపర్ స్టార్ త్యాగరాజ భగవతార్ కథను వాడుకున్నారని ఆయన మనువడు పిటిషన్‌లో పేర్కొన్నారు. వాస్తవానికి ఆయన గొప్పగా జీవించారని, భగవతార్ గురించి తప్పుగా చూపించారని తెలిపారు. దీనిపై మూవీ యూనిట్ ఈ నెల 18లోగా స్పందించాలని కోర్టు ఆదేశించింది. కాగా సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది.

News November 12, 2025

18 రోజులు.. ఈసారి మహాభారతమే

image

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.