News April 12, 2024

ఉప్పునుంతల: ఉపాధి కూలీల ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌పై కేసు

image

ఉప్పునుంతల మండలం కంసానిపల్లిలో నిన్న ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో దాదాపు 17 మంది ఉపాధి కూలీలు గాయాలయ్యాయి. ఘటనలో బాధితురాలు పద్మ ఫిర్యాదుతో ట్రాక్టర్ డ్రైవర్ ఆంజనేయులుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లెనిన్ తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందన్నారు. ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ ఆస్పత్రికి వెళ్లి క్షత్రగాత్రులకు వైద్య సేవలందించారు. గాయపడిన కూలీలను మాజీ ఎమ్మెల్యే గువ్వల పరామర్శించారు.

Similar News

News March 15, 2026

బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

image

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.

News March 15, 2026

MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

image

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

News March 14, 2026

సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

image

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.