News November 12, 2025

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి: MP

image

MHBD జిల్లాలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రత్యామ్నాయ మౌలిక సదుపాయాలు, అవసరమైన ఏర్పాట్లు చేయాలని దిశా కమిటీ ఛైర్మన్, MP బలరాం నాయక్ అన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంను కొనుగోలు కేంద్రాల సంఖ్య ప్రజావాసరాల దృష్ట్యా అట్టి సంఖ్యను పెంచి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Similar News

News November 13, 2025

WGL: అన్యాయం అంతరిస్తే ‘నా గొడవ’కు ముక్తి..!

image

‘అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి’ అంటూ ప్రజల గొడవను తన గొడవగా చెప్పిన మానవీయ కవి, ప్రజా కవి కాళోజీ నారాయణరావు. అన్నపు రాశులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, సంపదల్ని ఒకచోట గంపెడు బలగం ఒకచోట అంటూ, సమసమాజ నిర్మాణానికి తన కవితలతో కదం తొక్కిన ఉద్యమవీరుడు ఆయన. కోట్లాది ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు.
#నేడు కాళోజీ వర్ధంతి.

News November 13, 2025

పాల్వంచ: అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్

image

అత్తింటి వేధింపులు తాళలేక పురుగుమందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన సామర్ల యాదగిరి కుమార్తె దివ్య(21), రఘునాథపల్లి మండలం కుర్చపల్లికి చెందిన మంచాల రాజయ్య కొడుకు తిరుమల్ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో అత్తింటి నుంచి వరకట్న వేధింపులు తాళలేక దివ్య ఆత్మహత్యకు పాల్పడింది.

News November 13, 2025

కేసీఆర్‌పై జనవరి 19 వరకు చర్యలొద్దు: HC

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా KCRపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. వచ్చే ఏడాది JAN 19 వరకు ఆయనతోపాటు హరీశ్ రావు, ఎస్కే జోషి, స్మితా సభర్వాల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వం తరఫున న్యాయవాదికి 4 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను JAN 19కి వాయిదా వేసింది.