News November 13, 2025

గన్నవరం: జాతీయ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్.!

image

గన్నవరం (M)కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ (31)అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ గూడవల్లి చైతన్య కళాశాల హాస్టల్‌లో వంట మాస్టర్‌లుగా పనిచేసేవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గన్నవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News March 27, 2026

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి: MP బాలశౌరి

image

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో మచిలీపట్నం-తిరుపతి రైలును నిలిపివేశారని, అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన రైలును పునరుద్ధరించాలన్నారు.

News March 27, 2026

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించండి: MP బాలశౌరి

image

మచిలీపట్నం-తిరుపతి రైలును పునరుద్ధరించాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విన్ వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. కోవిడ్ సమయంలో మచిలీపట్నం-తిరుపతి రైలును నిలిపివేశారని, అప్పటి నుంచి మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిలిచిపోయిన రైలును పునరుద్ధరించాలన్నారు.

News March 27, 2026

కృష్ణా: డీపీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు

image

కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి వారి కార్యాలయంపై అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ కీలక అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న ఈ అధికారి పంచాయతీ కార్యదర్శులను టార్గెట్ చేసుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇవ్వని వాళ్లను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. 14ఏళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.