News April 12, 2024

పాపం.. అమ్మానాన్న కోసం యువతి ఆత్మహత్య

image

TG: పేరెంట్స్ విడిగా ఉండటం తట్టుకోలేకపోయిన ఓ యువతి ప్రాణాలర్పించారు. నల్గొండలోని తిప్పర్తి మండలం మాచినపల్లిలో భర్త పగిళ్ల సైదులు, భార్య సంధ్య గత రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరికి యోగిత(22), చాణక్య(20) సంతానం. యోగిత HYDలో PG చదువుతోంది. తల్లిదండ్రులను కలపాలని యోగిత ఎంతో ప్రయత్నించారు. అయినా వారు కలవలేదు. అమ్మానాన్న కలిసే పరిస్థితి లేదనే మనోవేదనతో ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Similar News

News March 22, 2026

వ్యర్థాలతో గ్యాస్ ఉత్పత్తి.. 5 ప్లాంట్ల ఏర్పాటు

image

AP: పట్టణ ప్రాంతాల్లోని ఘన వ్యర్థాలను కంప్రెస్డ్ బయో గ్యాస్‌(CBG)గా మార్చే ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాజమండ్రి, నెల్లూరు, గుంటూరు, ఒంగోలులో కొత్తగా వీటిని ఏర్పాటు చేయనుండగా, విజయవాడలో ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.59.85కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్రతి CBG ప్లాంట్ సామర్థ్యం రోజుకు 25 టన్నులు ఉంటుంది.

News March 22, 2026

కేరళంలో షిగెల్లా వ్యాధి.. చిన్నారి మృతి!

image

కేరళంలోని కోళికోడ్‌ జిల్లాలో షిగెల్లా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పెరువయల్‌ పంచాయతీలో ఇప్పటికే 12 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీంతో రక్త విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్లలోపు పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి.

News March 22, 2026

ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్

image

ఎలాంటి కండీషన్స్ లేకుండా హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్‌కు ట్రంప్ 48 గంటల గడువు విధించారు. లేదంటే ఇరాన్‌లోని అతిపెద్ద పవర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో పాటు చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. ఇప్పటికే ఇరాన్ అణుకేంద్రం సమీపంలో మిస్సైల్ దాడులు జరిగిన నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన ఈ ‘అల్టిమేటం’ హాట్ టాపిక్‌గా మారింది.