News November 13, 2025

సీఎం, పీఎంను తొలగించే బిల్లు.. జేపీసీలో మన ఎంపీలకూ చోటు

image

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లుపై కేంద్రం <<18272673>>ఏర్పాటు<<>> చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)లో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి అవకాశం లభించింది. బీజేపీ ఎంపీలు డీకే అరుణ, కె.లక్ష్మణ్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు, జనసేన ఎంపీ బాలశౌరి, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డికి చోటు దక్కింది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించాయి.

Similar News

News November 13, 2025

ఆ సినిమాలు చూసి నన్ను చంపాలనుకున్నారు: అదా శర్మ

image

రిస్క్ ఉన్న క్యారెక్టర్లను ఎంపిక చేసుకుని, నటించినప్పుడే కెరీర్‌కు విలువ పెరుగుతుందని హీరోయిన్ అదా శర్మ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ది కేరళ స్టోరీ, బస్తర్: ది నక్సల్ స్టోరీ మూవీలు రిలీజైన తర్వాత బెదిరింపులు ఎదుర్కొన్నాను. దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగిలిన వారు ప్రశంసించారు. వాళ్లే నన్ను కాపాడారు. నేను యాక్షన్, భావోద్వేగం, రిస్క్ ఉన్న స్క్రిప్ట్‌నే ఎంపిక చేసుకుంటా’ అని చెప్పారు.

News November 13, 2025

CBN గారూ.. మీ ‘క్రెడిట్‌ చోరీ స్కీం’ చాలా బాగుంది: జగన్

image

AP: క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి అంటూ CM CBNపై YCP అధినేత జగన్ విమర్శలకు దిగారు. ‘YCP హయాంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను మేమే కట్టేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మీ క్రెడిట్‌ చోరీ స్కీం చాలా బాగుంది. 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లూ మంజూరు చేయించలేదు. 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నాయి. మరో 87వేల ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకు కట్టించినవే’ అని ట్వీట్ చేశారు.

News November 13, 2025

వంటింటి చిట్కాలు

image

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.